పెసర పప్పు కిచిడి
- July 31, 2016
కావలసినవి :
బియ్యం : 3 కప్పులు , పెసర పప్పు : 1 కప్పు , పచ్చిమిర్చి : 4 , అల్లం వెల్లుల్లి : 2 టీ స్పూన్ , పసుపు : అర టీ స్పూన్ , లవంగాలు : 4 , దాల్చిన చెక్క : 1 , యాలకులు : 4 , షాజీర : అర టీ స్పూన్ , పలావు అకులు : 1 , నెయ్యి : 2 టీ స్పూన్లు , ఉప్పు తగినంత , కొత్తిమీర తురుము కొద్దిగ
తయారుచేసే విధానం :
బాణిలొ నెయ్యివేసి, షాజీర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వీసి వేయించాలి. తరువాత, అల్లంవెల్లుల్లి వేసి ఓ నిమిషం వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, పలావు ఆకులు, పసుపు వేయాలి. తరువాత నానబెట్టిన బియ్యం, పసుపు వేసి ఓ అయిదు నిమిషాలు వేయించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మంట తగ్గించి నీళ్లన్ని ఇగిరిపొయె వరకు సుమారు 15 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి దించాలి.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









