శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్
- February 28, 2026
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ‘డెకాయిట్’ చిత్ర బృందం శనివారం ఉదయం దర్శించుకుంది. ఈ చిత్రంలో జంటగా నటించిన హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీఐపీ విరామ దర్శనంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
త్వరలో విడుదల కానున్న తమ చిత్రం ‘డెకాయిట్’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ వీరు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అడివి శేష్, మృణాల్లను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో కొద్దిసేపు అక్కడ కోలాహలం నెలకొంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. గురువారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శేష్, నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
తాజా వార్తలు
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన









