నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- March 02, 2026
హైదరాబాద్: విపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని Ananthagiri Hills లో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
సోమవారం ఉదయం సుమారు 9:30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికిన అనంతరం నేరుగా వికారాబాద్కు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలపై డీసీసీ అధ్యక్షులకు మార్గదర్శనం చేయనున్నారు.
శిక్షణ శిబిరం ముగింపు అనంతరం సాయంత్రం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనతో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త దిశ లభించనున్నదని నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









