నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- March 02, 2026
హైదరాబాద్: విపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని Ananthagiri Hills లో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
సోమవారం ఉదయం సుమారు 9:30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికిన అనంతరం నేరుగా వికారాబాద్కు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలపై డీసీసీ అధ్యక్షులకు మార్గదర్శనం చేయనున్నారు.
శిక్షణ శిబిరం ముగింపు అనంతరం సాయంత్రం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనతో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త దిశ లభించనున్నదని నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









