నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- March 02, 2026
హైదరాబాద్: విపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని Ananthagiri Hills లో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
సోమవారం ఉదయం సుమారు 9:30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికిన అనంతరం నేరుగా వికారాబాద్కు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలపై డీసీసీ అధ్యక్షులకు మార్గదర్శనం చేయనున్నారు.
శిక్షణ శిబిరం ముగింపు అనంతరం సాయంత్రం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనతో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త దిశ లభించనున్నదని నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









