నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- March 02, 2026
హైదరాబాద్: విపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని Ananthagiri Hills లో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
సోమవారం ఉదయం సుమారు 9:30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికిన అనంతరం నేరుగా వికారాబాద్కు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలపై డీసీసీ అధ్యక్షులకు మార్గదర్శనం చేయనున్నారు.
శిక్షణ శిబిరం ముగింపు అనంతరం సాయంత్రం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనతో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త దిశ లభించనున్నదని నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







