యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- March 06, 2026
యూఏఈ: యూఏఈలో విమానయాన రంగం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. యూఏఈ బేస్డ్ విమానయాన సంస్థలు పరిమిత షెడ్యూల్ కార్యకలాపాలను ప్రకటించాయి. ప్రాంతీయంగా కొనసాగుతున్న సైనిక సంఘర్షణల మధ్య వైమానిక పరిమితుల కారణంగా దుబాయ్ ప్రధాన క్యారియర్ ఎమిరేట్స్ దాదాపు 100 కంటే ఎక్కువ ఫ్లైట్ షెడ్యూల్ ను ప్రకటించింది.
మార్చి 5 మరియు 6 తేదీల్లో దుబాయ్ నుండి 100 కి పైగా విమానాలు బయలుదేరి తిరిగి వస్తాయని ఎయిర్లైన్ తెలిపింది. అయితే, ప్రయాణికులు ధృవీకరించిన బుకింగ్ కలిగి ఉంటేనే విమానాశ్రయానికి వెళ్లాలని ఎయిర్లైన్ పునరుద్ఘాటించింది. ఫిబ్రవరి 28 మరియు మార్చి 31 మధ్య ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఏప్రిల్ 30న లేదా అంతకు ముందు ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకోవచ్చు అని ఎమిరేట్స్ తెలిపింది.
యూఎస్- ఇజ్రాయెల్ మరియు ఇరాన్లతో యుద్ధం ప్రారంభమైన తర్వాత యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలు తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇక దుబాయ్ రెండవ క్యారియర్ ఫ్లైదుబాయ్ కూడా దాని నెట్వర్క్లో తక్కువ షెడ్యూల్తో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
ఫ్లైదుబాయ్ నెట్వర్క్లో దుబాయ్ ద్వారా కనెక్ట్ అయ్యే ప్రయాణీకులు కనెక్టింగ్ ఫ్లైట్ పనిచేస్తుంటే మాత్రమే వారిని ప్రయాణించడానికి అనుమతిస్తామని ఎయిర్లైన్ తెలిపింది.
అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH) కూడా అబుదాబి సమన్వయంతో పరిమిత సంఖ్యలో విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. షార్జాకు చెందిన ఎయిర్ అరేబియా విమానాలు కూడా మార్చి 9న మధ్యాహ్నం 3 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









