పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- March 06, 2026
కువైట్ సిటీ: దేశంలో కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాల నేపథ్యంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. ముఖ్యంగా పిల్లలు, విదేశీ కార్మికులలో భయాందోళనలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రిత్వ శాఖ భద్రతా మీడియా విభాగం డైరెక్టర్ కల్నల్ ఉస్మాన్ మహమ్మద్ గరీబ్ స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు, యజమానులకు సూచనలు:
- సైరన్ల శబ్దం లేదా పేలుళ్ల శబ్దాలు వినిపించినప్పుడు పిల్లలు భయపడకుండా వారికి భరోసా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. భయం వల్ల పిల్లలపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
- ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతున్న గృహ కార్మికులకు,బయటి కార్మికులకు యజమానులు ధైర్యం చెప్పాలని కోరారు.
- దేశంలోని నివాసితులందరికీ అర్థమయ్యేలా భద్రతా సూచనలను మంత్రిత్వ శాఖ పలు భాషల్లో అందుబాటులో ఉంచింది.
పుకార్లపై కఠిన హెచ్చరిక:
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే వీడియోలను షేర్ చేయవద్దని కల్నల్ గరీబ్ గట్టిగా హెచ్చరించారు.ఇటువంటి చర్యలు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని, పుకార్లు వ్యాప్తి చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కువైట్ దేశ భద్రత కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు 24 గంటలూ శ్రమిస్తున్నాయని, పౌరులు మరియు ప్రవాసీలు చూపుతున్న సంఘీభావం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









