చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు
- August 01, 2016
దేశంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు వేశారు. బిహార్ నుంచి తెప్పించిన చేనేత సిల్క్ చీరను ధరించిన ఆమె ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అంతేకాకుండా ఐవేర్ హ్యాండ్లూమ్ యాష్ట్యాగ్ (#IWearHandloom)తో ఆమె సరికొత్త ఆన్లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు కూడా చేనేత వస్త్రాలు ధరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని, ఐవేర్ హ్యాండ్లూమ్ యాష్ట్యాగ్ తో ఆ పోస్టుకు మరో ఐదుగురిని ట్యాగ్ చేయాలని, ఆ ఐదుగురు కూడా ఇలా చేయడం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలువాలని ఆమె కోరారు.ఎంతో ఘనవైభవం కలిగిన చేనేత రంగం ఇప్పుడు అనేక కష్టాలతో సతమతమవుతున్నది. మొన్నటివరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా ఉండి పలు వివాదాలు ఎదుర్కొన్న స్మృతిని ఆ శాఖ నుంచి తప్పించి.. కేంద్ర జౌళి శాఖకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధికి ఆమె సంకల్పించారు.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







