డోపింగ్ కేసులో నర్సింగ్ యాదవ్కు క్లీన్చిట్
- August 01, 2016
డోపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్కు భారత డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు నర్సింగ్కు మార్గం సుగమమైంది. రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో భారత్ తరఫున నర్సింగ్ యాదవ్ బరిలో దిగనున్నాడు.
ఎన్నో ఆశలతో రియోకు సిద్ధమైన నర్సింగ్.. నాడా నిర్వహించిన డోప్ పరీక్షలో దొరికిపోయాడు. నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో అతడు ఒలింపిక్స్లో పాల్గొనడంపై గందరగోళం నెలకొంది. దీంతో నర్సింగ్పై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేశారు. నర్సింగ్ 'మెథన్డైనోన్' అనే నిషిద్ధ ఉత్ప్రేకరాన్ని వాడినట్లు గుర్తించారు. కాగా ఒలింపిక్స్కు వెళ్లకుండా అడ్డుకోవడానికి కుట్రపూరితంగా తనను ఇరికించారని నర్సింగ్ వాదించారు.
ఈ నేపథ్యంలో కుట్ర కోణంపై నాడా న్యాయ బృందం.. కమిటీ ముందు తమ వాదనలు వినిపించింది. విచారణ సందర్భంగా నర్సింగ్ కూడా హాజరయ్యాడు. తనపై కుట్ర జరిగిందనడానికి నర్సింగ్ సరైన ఆధారాలు సమర్పించలేదని న్యాయ బృందం వాదనలు వినిపించింది. కాగా పూర్తి విచారణ అనంతరం సోమవారం తుది తీర్పు వెలువరించిన నాడా నర్సింగ్కు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ రియో వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







