'గోదారి గట్టుపైన' బంగారు బొమ్మ సాంగ్ మార్చి 13న రిలీజ్

- March 11, 2026 , by Maagulf
\'గోదారి గట్టుపైన\' బంగారు బొమ్మ సాంగ్ మార్చి 13న రిలీజ్

'మేమ్ ఫేమస్' తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, చూడు చూడు,  'ఓ మై గాడ్' సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ బంగారు బొమ్మ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ పాట మార్చి 13న రిలీజ్ కానుంది. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందించగా,  సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ప్రవాల్య, ఎడిటింగ్ అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - సుభాష్ చంద్ర
బ్యానర్ - రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత - అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మధులిక సంచన లంక
DOP - సాయి సంతోష్
సంగీతం - నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ - అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ - ప్రవల్య డి
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్ - ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com