రైల్వేల్లో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

- August 02, 2016 , by Maagulf
రైల్వేల్లో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

భారత్‌లోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేల్లో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డులోకి బయట నుంచి ఓ ప్రతిభావంతుడిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌ నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రిసోర్స్‌ మొబిలైజేషన్‌, డెవలప్‌మెంట్‌లకు సంబంధించినవి చూసేకునేందుకు ఓ సలహాదారును నియమిస్తారు. వీరు రైల్వే ఆధునికీకరణను వేగవంతం చేస్తారని ప్రభుత్వం నమ్ముతోంది. నియామక కమిటీకి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బోర్డు విధివిధానాల్లో మార్పులు తీసుకురావాలనే నిర్ణయానికి ఓకే చేశారు. దీంతోపాటు బోర్డులో సభ్యులు వివిధ శాఖలను డీల్‌ చేస్తుంటారు. మెకానికల్‌ ఇంజినీర్ల రిక్రూట్‌మెంట్లను ఎస్‌సీఆర్‌ఏ పరీక్ష ద్వారా నియమించకూడదని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com