ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది...

- August 02, 2016 , by Maagulf
ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది...

మహారాష్ట్రలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మహారాష్ట్ర మహద్‌ వద్ద ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది. ప్రమాద సమయంలో వంతెనపై వెళుతున్న రెండు బస్సులు కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ముంబయి-గోవా రహదారిపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. సావిత్రినదిపై కూలిన వంతెన బ్రిటీష్‌ కాలం నాటిదని అధికారులు తెలిపారు. పురాతన వంతెన పక్కనే మరో కొత్త వంతెన కూడా ఉంది. కొత్త వంతెనపై నుంచి వెళ్లకుండా రెండు బస్సులు పురాతన వంతెనపైకి ఎందుకెళ్లాయని అధికారులు ఆరాతీస్తున్నారు. ముంబయి నుంచి ప్రత్యేక అధికారుల బృదం ఘటనాస్థలికి బయలుదేరింది. రాయగఢ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com