తితిదే పుష్కర యాత్ర ప్రారంభం కానుంది..
- August 02, 2016
తితిదే తరఫున కృష్ణా పుష్కర యాత్ర బుధవారం ఉదయం తిరుమల నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో తితిదే నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో వివిధ రకాల కైంకర్యాలు నిర్వహించేందుకు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కల్యాణరథంలో తిరుమల నుంచి పుష్కరయాత్రగా తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం, కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం; కర్నూలు జిల్లా మహానంది ఆలయం, శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయం; గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం మీదుగా విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి.. అక్కడి నుంచి అమరావతి మీదుగా శ్రీవారి నమూనా ఆలయానికి వేంచేస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







