తితిదే పుష్కర యాత్ర ప్రారంభం కానుంది..
- August 02, 2016
తితిదే తరఫున కృష్ణా పుష్కర యాత్ర బుధవారం ఉదయం తిరుమల నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో తితిదే నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో వివిధ రకాల కైంకర్యాలు నిర్వహించేందుకు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కల్యాణరథంలో తిరుమల నుంచి పుష్కరయాత్రగా తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం, కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం; కర్నూలు జిల్లా మహానంది ఆలయం, శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయం; గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం మీదుగా విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి.. అక్కడి నుంచి అమరావతి మీదుగా శ్రీవారి నమూనా ఆలయానికి వేంచేస్తుంది.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







