యువతీ హత్య కేసులో తాగుబోతుకు 4 ఏళ్ళ జైలు, 180 కొరడా దెబ్బల శిక్ష
- August 02, 2016
అజ్మన్ : తప్పతాగి తన స్నేహితురాలని దారుణంగా హత్య చేసిన ఓ వ్యక్తిని అజ్మన్ కోర్టు దోషిగా నిర్ణయించి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష మరియు 180 కొరడా దెబ్బలను విధించింది. నిందితుడు ఎన్ .ఎస్ .కె ,( 31) మూడు సంవత్సరాల క్రితం ఒక యువతిని హోటల్ అపార్ట్మెంట్లో గొంతునులిమి క్రూరంగా హత్యచేశాడని కోర్టు గుర్తించింది. హంతకుడు బాధితురాలి కుటుంబానికి, రక్త డబ్బు(దియా) అని పిలుస్తారు. ఆ మొత్తాన్ని 367,000 డి హెచ్ చెల్లించమని ఆదేశించింది.బాధితురాల పేరు బి .ఎఫ్.ఆర్. ఒక 23 ఏళ్ల ఆసియా దేశస్థురాలిగా గుర్తించబడినది.
అరబ్ మాధ్యమాలు తెలిపిన వివరాల ప్రకారం, అక్రమ సంబంధాల ఆరోపణలు, మరియు మద్యం వినియోగం ఆరోపణలపై హంతకునికి 180 కొరడా దెబ్బల శిక్ష విధించబడింది, అదేవిధంగా దేశ బహిష్కరణ సైతం అమలుచేయనున్నారు.యువతిని హత్య చేసిన నిందితుడు ఒక ఏడాది కాలంగా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ ను సందర్శించేవాడని గల్ఫ్ జాతీయ కోర్టు రికార్డులు గుర్తించాయి. అజ్మన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం బాధితురాలిని దారుణంగా గొంతు నులిమి చంపినా తర్వాత ఇక ఆమె శ్వాస లేదని నిర్ధారించుకున్న తర్వాత హంతకుడు వెలుపలికి వెళ్లి పూటుగా త్రాగి వచ్చి మంచానికి చేరుకొని ఏమీ జరగనట్లు నిర్భీతిగా నిద్రపోతున్నట్లు వివరించింది. హత్య చేసిన రెండు గంటల తర్వాత నిందితుడికి మెలుకువ రావడంతో సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తానే తన స్నేహితురాలిని హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







