ఉత్తరకొరియా తొలిసారిగా జపాన్ జలాల్లోకి బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం..
- August 03, 2016
ఉత్తరకొరియా తొలిసారిగా జపాన్ జలాల్లోకి ఖండాంతర క్షిపణి (బాలిస్టిక్ మిస్సైల్)ని ప్రయోగించింది. నేరుగా జపాన్ నియంత్రణలోని జలాల్లోకి క్షిపణి ప్రయోగించడంతో జపాన్ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియా చర్యలతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు.. ఉత్తరకొరియాకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉ.కొరియా రెండు ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించింది. అయితే అందులో ఒకటి టేకాఫ్ సమయంలోనే పేలిపోయినట్లు తెలిసిందని అమెరికా సైన్యం వెల్లడించింది.
దక్షిణ కొరియాలో అమెరికా క్షిపణి వ్యతిరేక సిస్టమ్ ఏర్పాటు చేసి.. అమెరికా, ద.కొరియా సైన్యాలు సంయుక్తంగా మిలిటరీ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉ.కొరియా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కొరియా ప్రయోగించిన ఓ క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో పడిందని.. జపాన్ ఉత్తర తీరానికి 250కిలోమీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోందని జపాన్ వెల్లడించింది. ఇది తమ దేశ భద్రతకు తీవ్రంగా ఆటంకం కలిగించే అంశమని జపాన్ ప్రధాని షింజో అబే ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. ఉ.కొరియా చర్యలను అమెరికా ఖండించింది. బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ ఉపయోగిస్తూ ఐరాస భద్రతా మండలి నిబంధనలను ఆ దేశం పూర్తిగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







