ఇరాన్తో శాంతి చర్చలకు వెళ్లము: ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్
- March 25, 2026
ఇరాన్తో యుద్ధం ఆపి శాంతి చర్చలకు అమెరికా ఇజ్రాయిల్ ప్రయత్నిస్తున్నాయి అనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ రాయబారి డానీ డనోస్ ఖండించారు. మంగళవారం ఐక్యరాజ్యసమితిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ‘ఇరాన్తో శాంతి చర్చల గురించి నాకు తెలియదు. మేము ఆపరేషన్ను కొనసాగిస్తున్నామని గమనించడం ముఖ్యం. మేము మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో.. ఇజ్రాయిల్, అమెరికా.. ఇరాన్లోని సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తున్నాయి. మేము దాడుల్ని కొనసాగిస్తాము. సంప్రదింపుల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆపరేషన్ గానీ ఘర్షణకు సంబంధించి ముగించడానికి దౌత్య మార్గాన్ని అనుసరించడమేనని మాకు తెలుసు. ఇరాన్కు అణ్వాయుధ సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం లేకుండా చేస్తాం. అలాగే కేవలం నెల రోజుల క్రితం అనుకుని ముందుకు తెచ్చిన లక్ష్యాలను సాధిస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాము. ఈ ఘర్షణల్లో మేము అనుకున్న చాలా లక్ష్యాలను సాధించామని అనుకుంటున్నాము. ఈ విషయాన్ని ఇరానీయులు గ్రహించారో లేదో నాకు తెలియదు. మేము అనుకున్నట్టుగా ఇరాన్లోని పరిపాలనను బలహీనపరిచాము. కానీ వారు మళ్లీ పాత పరిస్థితుల్లోకి వెళ్లకుండా మేము చేసుకోవాలి. మేము క్షేత్రస్థాయిలో ఒక విభిన్నమైన వాస్తవికతను సృష్టించాలనుకుంటున్నాము’ అని డానన్ అన్నారు. ఇజ్రాయిల్ ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతిని సమర్థించింది. అయితే ఇస్లామిక్ పాలన దీనికి విరుద్ధంగా ఉందని ఇజ్రాయిల్ రాయబారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు









