గవర్నర్ కి రాజీనామా సమర్పించిన ఆనందీబెన్ పటేల్
- August 03, 2016
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రాలను ఈరోజు రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లికి సమర్పించారు. తనకు త్వరలో 75 సంవత్సరాలు రాబోతున్నందున రాజీనామాకు అనుమతివ్వాలని ఆనందీబెన్ కోరిన సంగతి తెలిసిందే. ఆమె అభ్యర్థనను భాజపా పార్లమెంటరీ బోర్డు ఆమోదించడంతో అధికారికంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. భాజపా అధ్యక్షుడు అమిత్షా రేసులో ఉన్నారనే వార్తలను భాజపా కొట్టిపడేసింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరితో చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
సీఎం రేసులో ఆరోగ్య మంత్రి నితిన్ భాయ్ పటేల్, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ రూపానీ, కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాల, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భిక్షూభాయ్ దాల్సానియా, గిరిజనుడు అయిన శాసనసభ స్పీకర్ గణ్పత్ వాసవ ఉన్నారు. భాజపాకు కంచుకోట అయిన గుజరాత్లో ప్రస్తుతం పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన, గోరక్ష పేరుతో హిందూ అతివాద శక్తులు దళితులపై చేసిన దాడుల పట్ల నిరసన ఆందోళనలు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే నేత ఇప్పుడు ఆ రాష్ట్రానికి కావాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







