కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- March 30, 2026
కువైట్ః క్షిపణులు, డ్రోన్లతో ఒక సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో 10 మంది సాయుధ దళాలు గాయపడ్డాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశ గగనతలంలోకి ప్రవేశించిన 14 బాలిస్టిక్ క్షిపణులను, 12 డ్రోన్లను కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని అధికార ప్రతినిధి సౌద్ అల్-అత్వాన్ తెలిపారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్ని క్షిపణులు ఒక సైనిక స్థావరంపై పడిందని తెలిపారు. గాయపడిన సిబ్బంది చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ దాడిలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వేర్ హౌజ్ ని కూడా లక్ష్యంగా చేసుకున్నారని, దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం జరిగిందన్నారు.
ఫిబ్రవరి 28 నుంచి కువైట్ 307 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు, 616 డ్రోన్లను ఎదుర్కొందని అల్-అత్వాన్ వెల్లడించారు. సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, దేశ భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..
- ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..
- యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- దేశంలో ఎడ్యు కేషన్ సిస్టమ్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- ఈద్ అల్ అధా తేదీలు ప్రకటింపు
- ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్
- యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు 3 డ్రోన్లను అడ్డుకున్నాయి
- తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!









