కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- March 30, 2026
కువైట్ః క్షిపణులు, డ్రోన్లతో ఒక సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో 10 మంది సాయుధ దళాలు గాయపడ్డాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశ గగనతలంలోకి ప్రవేశించిన 14 బాలిస్టిక్ క్షిపణులను, 12 డ్రోన్లను కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని అధికార ప్రతినిధి సౌద్ అల్-అత్వాన్ తెలిపారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్ని క్షిపణులు ఒక సైనిక స్థావరంపై పడిందని తెలిపారు. గాయపడిన సిబ్బంది చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ దాడిలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వేర్ హౌజ్ ని కూడా లక్ష్యంగా చేసుకున్నారని, దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం జరిగిందన్నారు.
ఫిబ్రవరి 28 నుంచి కువైట్ 307 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు, 616 డ్రోన్లను ఎదుర్కొందని అల్-అత్వాన్ వెల్లడించారు. సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, దేశ భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







