వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'యువభేరి'..

- August 03, 2016 , by Maagulf
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  'యువభేరి'..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులో జరగనున్న 'యువభేరి' కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.గురువారం ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి నేరుగా నెల్లూరుకు వెళ్లనున్నారు. స్థానిక కస్తూరి దేవి గార్డెన్స్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే యువభేరిలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com