కిడ్నాప్ కు గురైన భారతీయ బాలిక క్షేమంగా ఇంటికి చేరుకొంది.

- August 04, 2016 , by Maagulf
కిడ్నాప్ కు గురైన  భారతీయ బాలిక  క్షేమంగా ఇంటికి చేరుకొంది.

మనామా: హోరా లో  గత  మంగళవారం రాత్రి  ఓ భారతీయ బాలికను అపహరణకు గురైన విషయం "మా గల్ఫ్ డాట్ కామ్"  పాఠకులకు విదితమే  . ఐదు ఏళ్ల సారా తీవ్ర ఉత్కంఠ తో కూడిన 24 గంటల తర్వాత కుటుంబంతో ఏకమయ్యారు. సారా తల్లి చల్లని స్టోర్ నుండి నీటిని కొనుగోలు చేసేందుకు  కారు బయటకు వెళ్ళిన సమయంలో మంగళవారం రాత్రి ఆమె కుమార్తెని  కారును దుండగులుఅపహరించారు.ఈ అపహరణలో ప్రధాన నిందితులైన ఒక పురుషుడు  మరియు ఒక మహిళ  కారు దొంగతనం చేయడంలోనే నిమగ్నమైనట్లు ఆ తర్వాత  వారు ఆ కారులో కూర్చున్న బాలికని గుర్తించడం జరిగిందని   అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.   ఆ నిందితుల ఇరువురి పేర్లు గుర్తింపులు బహిర్గతం కాకుండా వారిని  అదుపులోనికి తీసుకొన్నట్లు  పేర్కొంది.ఈ సందర్భంగా కాపిటల్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టరేట్ కల్నల్ ఖలీద్ అల్ తవాది మాట్లాడుతూ   కిడ్నాప్ చేసినవారు  ఒక బహ్రేయినీ వ్యక్తి (38), మరియు ఒక ఆసియా మహిళ(37) గా  తెలియచేసారు.ఈ బాలికని వేఠేకెందుకు  25 గస్తీ  వాహనాల బృందం అన్వేషణ జరిపినట్లు  పోలీసులు  తెలిపారు. ఈ కేసు గూర్చి తెలియడమే వారు దర్యాప్తుని వేగవంతంగా  ప్రారంభించారు. కిడ్నాప్ చేసినవారిని  గుర్తించారు. సారాతో వెళ్లిన కారులో ఉన్న ఓ మహిళా పాపని తీసుకువెళ్లి  హోరా లో ఉన్న తన ఇంటిలో దాచినట్లు   కనుగొనబడింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు  ఈ కిడ్నాప్  సంఘటన గురించి తెలిపినట్లు  మరియు వారిపై చట్టపరమైన చర్యలు  తీసుకుంటామని  "కల్నల్ అల్ తవాది పేర్కొన్నారు. పాప  బాబాయి అనీష్ చార్లెస్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాప దొరికినట్లు ఆమె గూర్చి సంతోషకరమైన వార్తని పోలీసులు   ధ్రువీకరించారు. వారు గత రాత్రి హోరా  పోలీసు స్టేషన్ నుండి సారాని తీసుకొనివచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com