అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- April 02, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కూటమి ఎంపీల బృందంతో కలిసి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్, ఏపీ కూటమి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
లోకేశ్ ప్రధానికి శాలువా కప్పి సాదరంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లోకేశ్ను అభినందించారు.అనంతరం లోకేశ్ బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి, బిల్లు ఆమోద ప్రక్రియలో ఆయన అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానితో భేటీ తర్వాత లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నారు. “అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది మంది ప్రజల తరపున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను.”భూములను త్యాగం చేసి, ఏళ్ల తరబడి అనిశ్చితిని ఎదుర్కొని అమరావతి కలను సజీవంగా ఉంచిన మన రైతుల అసాధారణ కథను ప్రధానికి వివరించినట్లు లోకేశ్ పేర్కొన్నారు.రైతుల త్యాగానికి గౌరవంగా అమరావతిని నిజమైన ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించడంలో ప్రధాని మార్గదర్శకత్వం కోరినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







