నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖల నమూనా....!!
- July 23, 2015
అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న నూతన రాజధాని నిర్మాణానికి ప్రాజెక్ట్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ ( పి పి పి ) సహకారంతో తయారు చేశామని భీమవరం వాస్తవ్యులు, ఒమన్ లో ప్రముఖ ప్రాజెక్ట్ నిర్వహణా నిపుణులు శ్రీ ఎం.ఎన్.ఆర్ గుప్త గారు భీమవరంలో సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఒమాన్ దేశ ఎన్ ఆర్ ఐ అయిన తను 50 మంది అంతర్జాతీయ నిపుణులతో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ ను తయారు చేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి అందజేశామని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం సుమారుగా 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ప్రస్తుతం ఒమన్ నుంచి సౌది అరేబియాకు జరుగుతుతన్న హైవే నిర్మాణానికి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మ్యాప్ మాత్రమే అందజేశారని తాము మాత్రం ఏ ఏ ప్రాంతాల్లో బిల్డింగులు నిర్మించాలి అనే వాటిపై ప్రాజెక్ట్ ల ద్వారా ప్లాన్ తయారు చేసి సి ఎమ్ కు ఇచ్చామని తెలిపారు. భీమవరానికి చెందిన తను 12 ఏళ్లలో అతి ప్రతిష్టాత్మకమైన 20 అవార్డులు సాధించానని ముఖ్యంగా రైల్వే కాన్ఫరెన్స్ అవార్డు 2014 ను అందుకున్నానని చెప్పారు. రాజధాని ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









