సింగర్ మంగ్లీ కేసు: లాయర్ సుబ్బారావు పై సీపీ సజ్జనార్కు విన్నపం
- April 14, 2026
హైదరాబాద్: ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ (సత్యవతి) మరియు న్యాయవాది సుబ్బారావు మధ్య మైక్రోఫైనాన్స్ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరింది. మైక్రోఫైనాన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తన పై రావడంతో, మంగ్లీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో ఆమె సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు చేశారు.
మంగ్లీ తన ఫిర్యాదులో న్యాయవాది సుబ్బారావు పై కీలక ఆరోపణలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన సోషల్ మీడియాలో మరియు ఇతర వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన పేరును అడ్డుపెట్టుకుని ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
మైక్రోఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల నుండి డబ్బు కాజేసిన అసలు వ్యక్తులను గుర్తించి, వారిని శిక్షించాలని మంగ్లీ కోరారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







