ఏపీ కేబినెట్ సమావేశాలకు కొత్త రూల్స్
- April 14, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో పారదర్శకత, సమయ పాలనను పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఎజెండా తయారీ, మెమోల సమర్పణకు సంబంధించి నూతన టైమ్స్ ను విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కేబినెట్ సమావేశం జరగడానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటల లోపు అన్ని శాఖల మంత్రులు/అధికారులు తమ ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే ఎటువంటి ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం, ముఖ్యమంత్రి ఆమోదంతో కేబినెట్ ఎజెండాను ఫైనలైజ్ చేస్తారు. అత్యంత అసాధారణమైన లేదా అత్యవసరమైన అంశాలను మాత్రమే ముఖ్యమంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్స్ గా చివరి నిమిషంలో చర్చకు అనుమతిస్తారు. ప్రభుత్వ రహస్యాల భద్రత, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని, ఎజెండా పంపిణీ విధానంలో పెను మార్పులు చేశారు.
ఇకపై కేబినెట్ ఎజెండాను వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పంపిణీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి సమాచారాన్ని ఈ క్యాబినేట్ పోర్టల్ ద్వారా మాత్రమే మంత్రులకు, సంబంధిత అధికారులకు అందుబాటులో ఉంచుతారు. గతంలో ఎజెండా తయారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. దీనివల్ల మంత్రులకు కూడా చర్చించాల్సిన అంశాలపై ముందుగానే పూర్తి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. పాలనలో వేగం పెంచడం, సాంకేతికతను జోడించడం ద్వారా నిర్ణయాల ప్రక్రియను మరింత పటిష్టం చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అన్ని శాఖల కార్యదర్శులు ఈ నూతన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం మెమోలో ఆదేశించింది.
తాజా వార్తలు
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి
- గెలిచిన 5 నెలల్లోపే సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్
- అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
- మే 1 నుంచి టీటీడీలో కొత్త రూల్స్..!
- అన్ సేఫ్ టాయ్స్ పట్ల సీపీఏ హెచ్చరిక..!!
- సౌదీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు..ఎన్సీఎం హెచ్చరిక..!!
- ఆన్లైన్ క్లాసెస్.. స్కూల్ ఖర్చులపై యూఏఈ ఫ్యామిలీస్ రీ థింకింగ్..!!
- కార్మికుల కేసులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగింత..!!









