మే 1న 'పిఠాపురంలో' రిలీజ్
- April 14, 2026
సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రం మే 1 న విడుదల కానుంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.
దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ "ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి , 2 పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా లో ప్రేమ ఉంది. సునిశిత హాస్యం ఉంది. సెంటిమెంట్ ఉంది. తండ్రీకూతుళ్ల అనుబంధం ఉంది. తప్పటడుగులు వేస్తే యువతరం ఏం కోల్పోతుందో అనే హెచ్చరిక ఉంది. మొత్తంగా అటు పెద్దలకు - ఇటు యువత కు మంచి సందేశం ఉంది. మన పక్కింట్లోనో, మన చుట్టూరా కనిపించే సహజమైన పాత్రలే ఈ సినిమాలో కనిపిస్తాయి. నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. నాకు అప్పట్లో ‘ ప్రేయసి రావే ‘ ఎలా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిందో, ఇప్పుడు ఈ ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ సినిమా నా కెరీర్ ని టర్న్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో ప్రముఖ పాత్ర లో నటించారు. హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ " అని తెలిపారు.
డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్, స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









