బాల దర్శకత్వంలో ముగ్గురు హీరోలతో జతకట్టనున్న అనుష్క
- August 05, 2016
మన సినిమాల్లో ఒక హీరో తో ముగ్గురు హీరోయిన్లు నటించడం కామనే..కానీ ఒక హీరొయిన్ తో ముగ్గురు హీరోలు నటించడం మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు అనుష్కతో ఏకంగా ముగ్గురు హీరోలు కలసి నటించబోతున్నారట.షాకింగ్ గా ఉంది కదూ!!..ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోలు అనుకుంటున్నారా..వాళ్ళే రానా,ఆర్య,విశాల్ . ఈ ముగ్గురూ అనుష్కతో కలసి బాలా డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నారట.
శివపుత్రుడు, నేను దేవుణ్ణి , వాడు వీడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు డైరెక్టర్ బాలా.సహజత్వానికి దగ్గరగా వుండే కథలతో వైవిధ్యమైన సినిమాలు తీసే బాలా డైరెక్షన్ లో నటించడానికి స్టార్లు కూడా రెడీగా వుంటారు.శివపుత్రుడులో విక్రమ్,సూర్య.. వాడు వీడులో ఆర్య,విశాల్ లు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకొని మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు బాలా మరో వైవిధ్యమైన కధను సిద్దం చేసాడట..ఈ సినిమా కోసం అనుష్క,రానా,విశాల్,ఆర్య,అరవింద్ స్వామి నటించబోతున్నారట.ప్రస్తుతం బాలా పూర్తి స్క్రిప్టును రాసే పనిలో వున్నాడట. ఈ ఇయర్ ఎండ్ కి ఈ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడట.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







