వడ్డీ రేట్లను తగ్గించిన బ్రిటన్
- August 05, 2016
బ్రిటన్ ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించింది. 2009 మార్చి తర్వాత మొట్టమొదటిసారిగా వడ్డీరేట్లను తగ్గిస్తూ గురువారం ఒక ప్రకటన వెలువడింది. బ్రెగ్జిట్ ఓటు నేపథ్యంలో ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు గానూ 170 బిలియన్ల పౌండ్ స్టెర్లింగ్ల విలువ చేసే ఎమర్జన్సీ ప్యాకేజీని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెలువరించింది. ఇదివరకెన్నడూ లేని విధంగా 0.5శాతం నుండి 0.25శాతానికి వడ్డీ రేట్లను తగ్గించడానికి ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఆర్ధిక సంక్షోభం తారా స్థాయిలో వున్నపుడు 2009 మార్చిలో చివరిసారిగా వడ్డీ రేట్లను తగ్గించారు. నూతన వాస్తవిక పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థకు ఇటువంటి చర్యలు అవసరమని, ఇటువంటి చర్యల వల్ల ప్రేరణ, ప్రోత్సాహం లభిస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ మార్క్ కేర్నీ చెప్పారు. సకాలంలో, సమగ్రంగా, సమన్వయంతో ఈ ప్యాకేజీని బ్యాంక్ తీసుకువచ్చిందని, వడ్డీ రేట్లలో కోత ప్రభావం తక్షణమే ఆర్ధిక వ్యవస్థలో కనిపిస్తుందని చెప్పారు. బ్రిటన్ ఇప్పుడు ఆర్ధిక మాంద్యాన్ని నివారించాల్సి వుందన్నారు. అయితే వచ్చే ఏడాదిలోగా అధిక నిరుద్యోగం, ఇళ్ళ ధరలు పడిపోవడం వంటివి జరగవచ్చని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









