20 లక్షల వైద్య సహాయం అందించి మరోసారి తన గొప్ప మనసు చాటిన చిరంజీవి
- April 20, 2026
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం వెండి తెరపైనే కాదు నిజజీవితంలో కూడా ఎంతో ఉన్నతంగా నిలుస్తుందని మరోసారి నిరూపించారు. ఆయన దయ, సహాయస్ఫూర్తి ఆయనను రియల్ హీరోగా నిలబెడుతున్నాయి.
గుండెకి సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ (శివ) కు 10.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్.అంతే కాకుండా అపోలో ఆసుపత్రిలో వ్యక్తిగతంగా వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని, పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు.
అదే సమయంలో తన మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య కుటుంబానికి కూడా అండగా నిలిచారు మెగాస్టార్. నరసయ్య భార్యకు అవసరమైన బైపాస్ శస్త్రచికిత్స కోసం 9.5 లక్షల రూపాయలు అందించి, ఆ కుటుంబానికి అత్యవసర సమయంలో జీవనాధారంగా నిలిచారు.
మొదట సినీ సంఘాల సభ్యులు సహాయం కోసం మెగాస్టార్ను సంప్రదించగా, ఆయన వెంటనే పూర్తి బాధ్యత తీసుకుంటూ, అన్నీ తానే చూసుకుంటానని చెప్పారు. ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వైద్య బిల్లులపై రాయితీని ఇప్పించడానికి చిరంజీవి స్వయంగా ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. ఫైనల్ బిల్లును కూడా స్వయంగా చెల్లించారు మెగాస్టార్.
ఒక వారం వ్యవధిలోనే మొత్తం 20 లక్షల రూపాయలను వైద్య సహాయంగా అందించిన చిరంజీవి, ఎందుకు కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారో మరోసారి నిరూపించారు.
ఇటీవల గద్దర్ అవార్డ్స్లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పొందిన ₹10 లక్షలను పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు మెగాస్టార్. మరో 5 లక్షలను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్కు విరాళంగా అందించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే తన నిబద్ధతను ఆయన నిరంతరం కొనసాగిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి బిగ్ స్క్రీన్ పైనే కాదు, నిజజీవితంలో దయ, దానం, ఉదారతలో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు చిరంజీవి.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









