తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- April 21, 2026
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల ముగింపు దశలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ భవిష్యత్ వ్యూహంపై దృష్టి సారించారు.ఈ నెల 27న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులకు ఆహ్వానాలు పంపించారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరగనుంది.
ఈ భేటీలో పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగవంతం చేయడం, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం, పార్టీ కేడర్ను చురుకుగా మార్చడం వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









