వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- April 22, 2026
చార్ ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో కొలువైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. శీతాకాలం విరామం తర్వాత శివయ్య సన్నిధిలో మళ్ళీ ఆధ్యాత్మిక కోలాహలం మొదలైంది.
కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని టన్నుల కొద్దీ రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మరియు డప్పు వాయిద్యాల మధ్య ఆలయ తలుపులు తీశారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
హిమాలయాల్లో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ, భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. హరహర మహాదేవ శంభో అనే నినాదాలతో కేదార్ లోయ మొత్తం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









