కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- May 01, 2026
మనామా: కార్పొరేట్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టే ముసాయిదా చట్టంపై రాజ్యాంగపరమైన ఆందోళనలను పార్లమెంట్ శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ లేవనెత్తింది. అదే సమయంలో అనేక ఇతర శాసన ప్రతిపాదనల చట్టబద్ధతను ఆమోదించింది. మహమూద్ మీర్జా ఫర్దాన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ.. అనేక ముసాయిదా చట్టాలు మరియు ప్రతిపాదనలను సమీక్షించింది.
ముఖ్యంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను చట్టం మరియు వ్యాపార కార్యకలాపాల ఫ్రేమ్ వర్క్ లోని ముసాయిదాలో రాజ్యాంగపరమైన సమస్యను గుర్తించినట్లు తెలిపారు. దానిని మరింత పరిశీలన చేయాలని రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేట్ రంగ కార్మిక చట్టంలోని ఆర్టికల్ 104(బి)ని సవరించాలనే ప్రతిపాదన రాజ్యాంగబద్ధతను కమిటీ ఆమోదించింది.
అలాగే, న్యాయాధికార చట్టానికి కొత్త ఆర్టికల్ 7 బిస్ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను కూడా కమిటీ ఆమోదించింది. దీనిని ప్రతినిధుల మండలి బ్యూరోకు సమర్పించే ముందు తదుపరి సమీక్ష కోసం ఆర్థిక మరియు వాణిజ్య వ్యవహారాల కమిటీకి రిఫర్ చేశారు. వీటితోపాటు పారిశ్రామిక ప్రాంతాలను నియంత్రించే చట్టానికి సవరణలను మరియు GCC ఏకీకృత ఎక్సైజ్ ట్యాక్స్ ఒప్పందానికి మార్పులను ధృవీకరించే ముసాయిదా చట్టాన్ని కమిటీ ఆమోదించినట్ల ఒక ప్రకటలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









