దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ పాట రాశారట!

- August 07, 2016 , by Maagulf
దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ పాట రాశారట!

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇజం'. అదితి ఆర్య కథానాయిక. జగపతిబాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ పాట రాశారట. ఇందులో ఈ పాట చాలా ప్రత్యేకమని సమాచారం. ఈనెల 11 నుంచి 'ఇజం' చిత్ర బృందం స్పెయిన్‌ వెళ్లనుంది. అక్కడ పలు సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com