జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- May 05, 2026
కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగం సహకారంతో ప్రజా పనుల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న రోడ్డు పనుల నేపథ్యంలో జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్డుపై తాత్కాలిక పాక్షిక మూసివేతను ప్రకటించింది.
ఈ మూసివేత ఖుర్తుబా ప్రాంతానికి ఎదురుగా ఉన్న మూడు కుడి లేన్లను ప్రభావితం చేస్తుందని, ఇది సుమారు 500 మీటర్ల మేర విస్తరించి ఉందని పేర్కొన్నది. ఇది ట్రాఫిక్ ఆంక్షులు ఈనెల 16 వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
కాగా, పనులు జరుగుతున్న సమయంలో మూడు లేన్లు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటాయని అధికారులు ధృవీకరించారు. కింగ్ ఫైసల్ రోడ్డుకు వెళ్లే నిష్క్రమణ మార్గం కూడా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో అల్-సుర్రా మరియు డమాస్కస్/ఖుర్తుబా వీధి నుండి జహ్రా వైపు వెళ్లే వాహనదారుల కోసం సమాంతర సర్వీస్ రోడ్డు తెరిచి ఉంటుందని తెలిపారు.
ఆ ప్రాంతంలో భద్రత, సులభమైన ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి రహదారి వినియోగదారులు జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









