తీవ్రవాదం కేసుల్లో 526 మందికి దేశబహిష్కరణ
- August 07, 2016
తీవ్రవాదం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 526 మందిని దేశం నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జస్టిస్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. జైల్లో ఉన్న 833 మందిలో 526 మందిని త్వరలో డిపోర్ట్ చేయనున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. వీరిలో ఎక్కువమంది అల్ ఖైదీ మరియు ముస్లిం బ్రదర్హుడ్కి చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. ఈ సంస్థల్ని టెర్రరిస్టు ఆర్గనైజేషన్లుగా ప్రభుత్వం గుర్తించింది. మిగిలినవారిని హౌతీ సానుభూతిపరులుగా గుర్తించారు. ఇరాన్, బషర్ అస్సాద్ నుంచి వచ్చి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వీరంతా. జనరల్ డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించిన టెర్రర్ సస్పెక్ట్స్ సంఖ్య 5,176 కాగా, ఇందులో 4,343 మంది సౌదీలు, 47 మంది ఎమనీలు ఉన్నారు. అరెస్టయిన 12 మంది ఇరానియన్స్లో 9 మంది గత జూన్లో అరెస్టయ్యారు. ఆగస్ట్ 1, 2 తేదీల్లో 14 మంది తీవ్రవాదుల్ని సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. ఇదిలా ఉండగా, 224 మందిని తీవ్రాదం కేసుల్లో నిర్దోషులుగా గుర్తించి విడుదల చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







