బుర్జ్‌ ప్లాజా అబ్రా స్టేషన్‌ని ప్రారంభించిన ఆర్‌టిఎ

- August 07, 2016 , by Maagulf
బుర్జ్‌ ప్లాజా అబ్రా స్టేషన్‌ని ప్రారంభించిన ఆర్‌టిఎ

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, అబ్రా సర్వీసు విస్తరణలో భాగంగా దుబాయ్‌ ఫౌంటెయిన్‌ లేక్‌ వద్ద బుర్జ్‌ ప్లాజా స్టేషన్‌ని ప్రారంభించింది. దీంతో మరింతమంది విజిటర్స్‌ దుబాయ్‌ ఫౌంటేషన్‌ షోలను వీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. ప్యాలెస్‌ హోటల్‌ రెసిడెంట్స్‌ కోసం కొత్త స్టేషన్‌ ప్రారంభోత్సవం కోసం నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. వీక్‌ డేస్‌లో అబ్రాస్‌ 6 నుంచి 11 గంటల వరకు నిర్వహించబడుతుంది. ప్రతి అబ్రా, ఏడు నుంచి తొమ్మిది మంది రైడర్స్‌ని అకామడేట్‌ చేస్తుంది. ఒక వ్యక్తికి 65 దిర్హామ్‌లుగా టిక్కెట్‌ ఉంటుంది. సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్కలద్వారా ఈ టిక్కెట్లను పొందవచ్చు. ఆర్‌టిఎ మెరైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పలు రకాలైన కొత్త ఇన్వెన్షన్స్‌తో తమ ప్రత్యేకతను చాటుకుటోందని ఆర్‌టిఎ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ మెరైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డైరెక్టర్‌ మన్సూర్‌ అల్‌ ఫలాసి చెప్పారు. దుబాయ్‌ ఫౌంటేన్‌ లేక్‌ షోస్‌కి విపరీతమైన పాపులారిటీ ఉంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com