గ్యాంగస్టర్ నయీం హతమయ్యాడు....

- August 08, 2016 , by Maagulf
గ్యాంగస్టర్ నయీం హతమయ్యాడు....

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో గ్యాంగస్టర్ నయీం హతమయ్యాడు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు గాలింపు చేపట్టారు. అధికారుల రాకను గమనించిన వాళ్లపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కాల్పులు మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో ఓ నయిం హతమైయ్యాడు.మరో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. మిలీనియం టౌన్‌షిప్‌ టవర్‌ గ్రేహౌండ్స్ తమ అదుపులోకి వెళ్లింది. మిగిలినవారి కోసం గాలింపు జరుగుతోంది. షాద్‌నగర్ టౌన్‌షిప్‌లో కొంతమంది ఉగ్రవాదులున్నట్లు గతరాత్రి అధికారులకు సమాచారం వెళ్లిందట. ఈ క్రమంలో అర్ధరాత్రి నుంచి గాలింపు, కాల్పులు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com