దుబాయ్లో ఘనంగా మహానాడు వేడుకలు
- May 29, 2026
దుబాయ్: మహానాడు సందర్భంగా దుబాయ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు, గుర్తులతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తెలుగుదేశం పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలుగు జాతి గౌరవం, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో *యూఏఈ టీడీపీ అధ్యక్షులు మోతుకూరి విశ్వేశ్వరరావు, కోడి రాజా రవి కిరణ్, ప్రసాదు దారాపనేని, సునీల్ బోయపాటి, వర ప్రసాద్ కందిబేడల(సౌదీ), మధుసూదన్ తాళ్లూరి, శివ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు* తదితరులు పాల్గొన్నారు.
మహానాడు స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారు మరింత ఐక్యంగా ముందుకు సాగాలని, తెలుగు ప్రజల అభ్యున్నతి మరియు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







