మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- May 31, 2026
రియాద్: 2026 హజ్ సీజన్ కోసం రూపొందించిన తన కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసినట్లు మక్కా మున్సిపాలిటీ ప్రకటించింది. ఈ ప్రణాళికను 22వేలమందికి పైగా సిబ్బందితో కూడిన ఒక ప్రత్యేక బృందం చేపట్టిందని పేర్కొంది. మక్కా మరియు పవిత్ర స్థలాల అంతటా 24 గంటలూ పనిచేసే 3వేల యంత్రాలు మరియు పరికరాలు వీరికి సహాయకారిగా నిలిచాయని తెలిపింది.
మక్కా మరియు పవిత్ర స్థలాల్లోని వంటశాలలు (catering kitchens) మరియు ఆహార సంస్థలలో ప్రత్యేక బృందాలు 38వేలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించాయని, ప్రయోగశాలల ద్వారా 5వేలకు పైగా ఆహార నమూనాలను పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహమ్మద్ అల్ రసాసిమా తెలిపారు. 2026 హజ్ సీజన్ మొత్తం మీద ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
మక్కాలో 2,50,000 టన్నులకు పైగా వ్యర్థాలు తొలగించినట్లు తెలిపాటరు.దీంతోపాటు పవిత్ర స్థలాల నుండి 16వేల టన్నులకు పైగా వ్యర్థాలు తొలగించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







