గాయని లక్ష్యంగా..అభ్యంతరకరమైన స్నాప్చాట్ పోస్టులు..కవికి జైలుశిక్ష..!!
- June 02, 2026
మనామా: ప్రముఖ బహ్రెయిన్ గాయనిని అభ్యంతరకరమైన స్నాప్చాట్ పోస్టుల ద్వారా వేధించినందుకు ఒక కవిని దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది. 2024లో గాయని స్నాప్చాట్ ఖాతాలో అవమానకరమైన, కించపరిచే వ్యాఖ్యలను ప్రచురించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగా ఆమెకు మనోవేదన కలిగించాడని కోర్టు నిర్ధారించింది.
గాయని ఫిర్యాదు మేరకు కమ్యూనికేషన్ పరికరాలను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అభియోగాలు మోపింది. దిగువ కోర్టు మొదట నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసి, సంబంధిత సివిల్ కేసును కొట్టివేసింది. అయితే, ఆ తర్వాత హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆ తీర్పును రద్దు చేసి, నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇరు పక్షాల మధ్య వృత్తిపరమైన సంబంధం దెబ్బతిన్న తర్వాత, స్నాప్చాట్ పోస్టులను ప్రచురించినట్లు కోర్ట తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- డాలస్లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!
- గ్లోబల్ ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్..ఒమన్ కు ఫస్ట్ ర్యాంక్..!!
- గాయని లక్ష్యంగా..అభ్యంతరకరమైన స్నాప్చాట్ పోస్టులు..కవికి జైలుశిక్ష..!!
- కువైట్ జలాల్లో షార్క్.. ఈపీఏ క్లారిటీ..!!
- షార్జాలో బాలుడు మృతి..సీసీటీవీ ఫుటేజీతో విచారణ వేగవంతం..!!
- ఇన్వెస్ట్ మెంట్ రౌండ్స్.. ముందస్తు నోటిఫికేషన్ తప్పనిసరి: SAMA
- తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చినం: కేసీఆర్









