నేడు స్వల్పంగా బంగారం ధర పెరిగింది..

- August 09, 2016 , by Maagulf
నేడు స్వల్పంగా బంగారం ధర పెరిగింది..

వరసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.70 పెరిగి రూ.30,970కి చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరిగినట్లు బులియన్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0.28శాతం తగ్గి 1,331.30 డాలర్లకు చేరింది.ఈరోజు మార్కెట్లో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి రూ.50 పెరిగి రూ.46,300కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి ధర తగ్గింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.48శాతం తగ్గి 19.58 డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com