స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- June 04, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1పై బుధవారం జరిగిన మిస్సైల్ అటాక్ లో మరణించిన భారత జాతీయుడిని మధ్యప్రదేశ్కు చెందిన మన్సూర్ అహ్మద్ రెహమాన్ (55)గా గుర్తించారు. ఈ విషాదం జరిగినప్పుడు అతను భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. రెహమాన్ కువైట్ నుండి బహ్రెయిన్ మీదుగా ముంబైకి వెళ్లే గల్ఫ్ ఎయిర్ విమానం ఎక్కడానికి విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతను టెర్మినల్ 1లో చెక్-ఇన్ ప్రక్రియలు పూర్తి చేస్తుండగా, మిస్సైల్ శిథిలాలు తాకడంతో అతను మరణించాడు.
జూన్ 1 నుండి టెర్మినల్ 1 ద్వారా విదేశీ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాయని ప్రకటించిన తర్వాత, రహ్మాన్ మే 30న తన టిక్కెట్టును బుక్ చేసుకున్నాడు. దాడి జరిగినప్పుడు, అతను స్వదేశానికి తిరిగి వెళ్లడానికి వేచిఉన్న ప్రయాణికులలో ఒకడు. ఆ సమయంలో టెర్మినల్లో ఉన్న పలువురు గాయపడి, చికిత్స పొందుతున్నారు. కాగా, కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో రహ్మాన్ పార్థివ దేహాన్ని భారతదేశానికి తరలించే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









