అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా మోదీ....తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- June 09, 2026
హైదరాబాద్: దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.ఇది ప్రధాని నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ మేరకు లోక్ భవన్ మంగళవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేస్తుంది .
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని గవర్నర్ శివ ప్రతాప్ పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలోనూ కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు.
‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన దిశగా చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దనున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
“తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఆయన నాయకత్వంలో దేశం మరింత ప్రగతి, సుసంపన్నత సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు
- షార్జా–మస్కట్ రూట్లో అదనపు సర్వీసులు









