పెరిగిన బంగారం, వెండి ధరలు
- August 10, 2016
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు జోరుగా పెరిగాయి. దీంతో బుధవారం పసిడి ధర రూ. 31వేల పైకి చేరగా.. వెండి కూడా ఒక్క రోజే రూ. వెయ్యికి పైగా పెరిగి 47వేల మార్కును దాటింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 310 పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి రూ. 31,280గా ఉంది. అంతర్జాతీయంగా 1.1శాతం పెరిగి.. సింగపూర్ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,355.41 డాలర్లుగా ఉంది. వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. ఒక్క రోజే రూ. 1,050 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,350కు చేరింది.
నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







