ఇకె 521 ప్రయాణీకులకు 7,000 డాలర్ల కాంపన్సేషన్
- August 10, 2016
ఎమిరేట్స్ విమానం ఇకె 521 ప్రమాదవశాత్తూ క్రాష్ ల్యాండ్ అయిన ఘటనలో ప్రయాణీకులందరికీ కాంపెన్సేషన్ కింద 7,000 డాలర్లను అందించనున్నట్లు సమాచారం అందించారు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ నుంచి మెయిల్ ద్వారా ఈ సమాచారం తమకు అందినట్లు ఆ రోజు విమానంలో ఇద్దరు పిల్లలు, భార్యతోపాటు ప్రయాణించిన ఓ వ్యక్తి వెల్లడించారు. ఎయిర్లైన్ సంస్థ ఇంత త్వరగా ఈ చర్యలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ దుర్ఘటన నుంచి తృటిలో ప్రాణాలు దక్కించుకోవడం చాలా అద్భుతమని ఆయన అన్నారు. ఆగస్ట్ 3న బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదవశాత్తూ క్రాష్ ల్యాండ్ కాగా, అందులోని మొత్తం ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఓ ఫైర్ ఫైటర్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన త్యాగానికి గుర్తుగా సివిల్ డిఫెన్స్ ట్రైయినింగ్ వింగ్లో ఓ హాల్కి అతని పేరుని పెట్టారు. మృతి చెందిన ఫైర్ ఫైటర్ పేరు అల్ బలౌషి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







