జాతీయ జెండాని ఎగరవేసేందుకు రానున్న భారత రాయబారి

- August 10, 2016 , by Maagulf
జాతీయ జెండాని  ఎగరవేసేందుకు రానున్న భారత రాయబారి

 కతార్​: భారతదేశం యొక్క 70 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ  వేడుకని ఆగష్టు 15 వ తేదీ ఉదయం 7 గంటలకు  ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐ సి సి ) ఆధ్వర్యంలో  జరుపుకోనున్నారు   భారత రాయబారి సంజీవ్ అరోరా కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసే మరియు భారత రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని అందరకి చదివి వినిపిస్తారు.దోహా లోని  భారతీయ పాఠశాలల్లో విద్యార్థులు  ఈ  కార్యక్రమంలో పాల్గొననున్నారని భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.జాతీయ పతాకావిష్కరణ వేడుకకు భారతీయ జాతీయులు అందరూ హాజరుకావాలని  దౌత్యకార్యాలయం ఆహ్వానించింది, ఈ కార్యక్రమానికి వచ్చే వారందరు తమ వెంట ఒక ఫోటో గుర్తింపు పత్రం కూడా  తీసుకునిరావాలని ఈ సందర్భంగా దౌత్య కార్యాలయం అధికారులు అభ్యర్థించారు.వీధి నెంబర్ 916 లో ఉన్న వాహబ్ బిన్ ఆమిర్ , అల్ మమౌర  ఐసీసీ ప్రాంగణంలో జరిగే ఈ వేడుకలో  ఫలహారాలు కార్యక్రమ సమయంలో వడ్డిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com