తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ సంతరించుకుంది
- August 11, 2016
కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ సంతరించుకుంది. విజయవాడలోని దుర్గాఘాట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు చీర,సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్లలో సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమరావతి, శ్రీశైలం, విజయవాడతోపాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద పుష్కరస్నానం ఆచరించేందుకు భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







