సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!
- August 17, 2026
యాన్బు: సముద్రంలో పడవ మొరాయించడంతో చిక్కుకుపోయిన ఐదుగురు సౌదీ పౌరులను బోర్డర్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. మదీనా ప్రాంతంలోని యాన్బు గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పడవ సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అందులో ఉన్న ఐదుగురు పౌరులు సహాయం కోసం కాల్ చేశారు. సమాచారం అందుకున్న బోర్డర్ గార్డ్కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.
సముద్రంలోకి వెళ్లే ముందు తమ పడవలు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సూచించింది. సముద్ర భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని కోరింది.
సముద్రంలో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న వారు సహాయం కోసం మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్లలో 911కు.. మిగిలిన ప్రాంతాల్లో అత్యవసర సహాయం కోసం 994కు ఫోన్ చేయాలని బోర్డర్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రమాద బాధితుల ఫొటోలు తీస్తే జైలు.. QR10,000 వరకు ఫైన్..!!
- నేటితో అమెరికా-ఇరాన్ 60 రోజుల ఒప్పందం పూర్తి
- ఒమన్లో టెలికాం ప్రమోషనల్ మెసేజ్లపై ఆంక్షలు..!!
- నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్గా నియామకం..
- విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్లు ప్రారంభం..
- దుబాయ్లో అద్దె చెల్లింపులకు ఇక లోన్లు అవసరం లేదు.. నెలవారీగా చెల్లించే అవకాశం..!!
- కువైట్లో పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల విక్రయంపై ఆంక్షలు..!!
- ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!
- సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్







