అరెస్టయిన భారతీయుడికి ఇండియన్ ఎంబసీ సాయం
- August 12, 2016
అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, ఫోర్జరీ కేసులో అరెస్టయిన భారతీయుడి కేసులో అతనికి సహాయ పడేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ విషయంలో తమకు తగిన సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు బాధితుడి 16 ఏళ్ళ కుమార్తె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అబుదాబీలోని గల్ఫ్ బేస్డ్ బ్యాంక్లో తన తండ్రి పనిచేస్తున్నారని ఆమె వివరించింది. ఫోర్జరీ కేసులో జులై 19న ఆయన అరెస్టయ్యారు. ఉచితంగా లీగల్ కౌన్సిలింగ్ని లీగల్ కౌన్సెలర్స్ ద్వారా ఇవ్వగలుగుతామని ఎంబసీ అధికారులు ఆ కుటుంబానికి సమాచారమిచ్చారు. యూఏఈ అథారిటీస్తో ఈ విషయమై చర్చించినట్లు కౌన్సెలర్ దినేష్ కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆ బాలిక, తన తల్లి గృహిణి అనీ ఇటీవలే జైల్లో తన తండ్రిని కలిసి వచ్చారని చెప్పింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









