అరెస్టయిన భారతీయుడికి ఇండియన్ ఎంబసీ సాయం
- August 12, 2016అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, ఫోర్జరీ కేసులో అరెస్టయిన భారతీయుడి కేసులో అతనికి సహాయ పడేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ విషయంలో తమకు తగిన సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు బాధితుడి 16 ఏళ్ళ కుమార్తె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అబుదాబీలోని గల్ఫ్ బేస్డ్ బ్యాంక్లో తన తండ్రి పనిచేస్తున్నారని ఆమె వివరించింది. ఫోర్జరీ కేసులో జులై 19న ఆయన అరెస్టయ్యారు. ఉచితంగా లీగల్ కౌన్సిలింగ్ని లీగల్ కౌన్సెలర్స్ ద్వారా ఇవ్వగలుగుతామని ఎంబసీ అధికారులు ఆ కుటుంబానికి సమాచారమిచ్చారు. యూఏఈ అథారిటీస్తో ఈ విషయమై చర్చించినట్లు కౌన్సెలర్ దినేష్ కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆ బాలిక, తన తల్లి గృహిణి అనీ ఇటీవలే జైల్లో తన తండ్రిని కలిసి వచ్చారని చెప్పింది.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి