మజ్ను సినిమాలో గెస్ట్ పాత్రలో రాజ్ తరుణ్..
- August 13, 2016
న్యాచురల్ స్టార్ నాని , ఉయ్యాల జంపాలా ఫేం విరించి వర్మ కాంబినేషన్ లో మజ్ను అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జెమిని కిరణ్ నిర్మిస్తున్న మజ్ను చిత్రంలో అను ఇమాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. మజ్ను చిత్రంలో ఓ గెస్ట్ పాత్ర ఉండగా, ఆ పాత్రకు యంగ్ హీరో రాజ్ తరణ్ ని ఎంపిక చేశారట. రాజ్ తరుణ్ విరంచి వర్మతో కలిసి ఉయ్యాల జంపాల అనే చిత్రాన్ని చేసాడు కాబట్టి ఆ పరిచయంతోనే ఈ కుర్ర హీరోని ఎంపిక చేసారని చెబుతున్నారు. రాజ్ తరుణ్ కూడా గెస్ట్ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఒకవైపు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నా కూడా మరో సినిమాలో గెస్ట్ పాత్రకి ఒప్పుకోవడం అభినందనీయం అని పలువురు ఈ హీరోని ప్రశంసిస్తున్నారు. అయితే రాజ్ తరుణ్ పాత్ర సినిమా క్లైమాక్స్ లో ఎలివేట్ అవుతుందని సమాచారం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







