కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- July 15, 2026
కువైట్ సిటీ: కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)కి చెందిన ఒక ఆఫ్-షోర్ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన ఉద్యోగిని చమురు శాఖ మంత్రి తారిఖ్ అల్-రౌమీ పరామర్శించారు. అల్-అదాన్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, చికిత్స పొందుతున్న సదరు కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) అధికారులు ఉన్నారు. గత ఆదివారం జరిగిన ఈ దాడిలో, KOC అనుబంధ చమురు సేవల సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ మొహ్సేన్ సులేమాన్ అనే కార్మికుడు గాయపడ్డారు.
ఈ సందర్భంగా చమురు క్షేత్రంపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న వరుస దాడుల్లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. దేశ చమురు రంగంలో పనిచేసే ఉద్యోగుల రక్షణకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అల్-రౌమీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!







