డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- July 17, 2026
దుబాయ్: డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ వెలువడిన వార్తలను దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (GDMO) ఖండించింది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ రియూటర్స్ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డౌన్టౌన్ దుబాయ్ ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
దీనిపై స్పందించిన దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం, డౌన్టౌన్ దుబాయ్లో ఎలాంటి పేలుళ్ల ఘటన జరగలేదని, రాయిటర్స్ ప్రచురించిన సమాచారం వాస్తవాలకు విరుద్ధమని వెల్లడించింది.
ప్రజలు, మీడియా సంస్థలు అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని, ధృవీకరణ లేని వార్తలు, పుకార్లను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జీడీఎంఓ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







