ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- July 17, 2026
సలాలా: ఒమన్లోని ధోఫార్ గవర్నరేట్లో పర్యాటకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ (Your Path is Green) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గురువారం అల్ బలీద్ పురావస్తు పార్క్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఖరీఫ్ ధోఫార్–2026 ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అవాసర్ (Awasr) కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ధోఫార్కు వచ్చే సందర్శకుల్లో పర్యాటక అవగాహన పెంపొందించడం, డిజిటల్ కమ్యూనికేషన్ విధానాలు మరియు స్మార్ట్ మార్గదర్శక సందేశాల ద్వారా ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం, అలాగే పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
హెరిటేజ్, పర్యాటక ప్రాంతాల్లో గైడెడ్ ఫీల్డ్ టూర్లు నిర్వహించడంతో పాటు, సందర్శకులతో ప్రత్యేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సందేశాలను పరస్పర చర్చల రూపంలో అందించనున్నారు. ఇందుకోసం అవాసర్ కంపెనీ డిజిటల్ మౌలిక సదుపాయాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సలాలా వాలి షేక్ డాక్టర్ సయీద్ బిన్ హుమైద్ అల్ హార్థీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







